నాగచైతన్య మూవీకి రికార్డ్ బిజినెస్..
నాగచైతన్య మూవీకి రికార్డ్ బిజినెస్..

కార్తీక్ దండు దర్శకత్వంలో "ఎన్‌సీ 24" వర్కింగ్ టైటిల్ తో విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య తన 24వ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. "ఎన్‌సీ 24":ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్ అంటూ ఇటీవలే ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయగా అది అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కోసం చైతూ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. అంతేకాదు నాగచైతన్య కెరీర్‌ లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా ఇది నిలవనుంది.

నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి ఈ సినిమాలో  హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ సహా మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో తెరకెక్కని మైథలాజికల్ కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు కార్తీక్ దండు. ఈ ఏడాది చివరికి నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

మైథలాజికల్ థ్రిల్లర్‌గా నాగచైతన్య, విరూపాక్ష కాంబో లో కార్తీక్ దండు భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే భారీ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 10 శాతం షూటింగ్ పూర్తి కాగా.. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రూ.34 కోట్లకు దక్కించుకున్నారట. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ దశలోనే ఇలా ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక ఓ రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయని అక్కినేని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.