Photos

Director VN Aditya about Ustaad Bhagat Singh at Vimal Theatre

TFDA

3 hours ago

“రెనరెజైజ్ 2026” భారతదేశ క్లీన్ ఎనర్జై, స్టారాప్ & పాలసీ లీడర షిప్ ఫోరం

Renergize 2026, India’s Clean Energy, Startup & Policy Leadership Forum


“రెనర్జైజ్ 2026” భారతదేశ ఎనర్జీ భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు మరియు సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో AI ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ “రెంజీ (RENGY)” ఆధ్వర్యంలో “రెనర్జైజ్ 2026” జాతీయ స్థాయి కాంక్లేవ్ శనివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల లోక్ సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైహోమ్స్ గ్రూప్ ఛైర్మెన్ రామేశ్వర్ రావు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.రమేష్ రెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండి అనిలా వావిళ్ల సహా పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో తొలి సారిగా ఏఐ ఆధారిత సేవలు అదిస్తున్న రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ సంస్థ “రెంజీ (RENGY)” కీ ఫీచర్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ‘రెంజీ’ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. సాంప్రదాయ వనరులపై దేశం అతిగా ఆధారపడకుండా, పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రధాని మోదీ 'క్లీన్ ఎనర్జీ విప్లవం' తీసుకొచ్చారు. ఇవాళ దేశంలో ‘రెన్యూవబుల్ ఎనర్జీ’ వినియోగం అనేది కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా, ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారింది. ఇంటిటింకి సోలార్ కరెంట్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ యోజన, రైతలు తమ పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పీఎం కుసమ్ యోజన, ఇందన ఉత్పత్పిలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిపేందుకు నేషనల్ సోలార్ మిషన్ స్కీంలను కేంద్రం తీసుకువచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతోపాటు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC), కోలిండియా (CIL) రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని గతేడాది అక్టోబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. అయితే దురదృష్టవశాత్తూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, భూమి కేటాయింపులు జరిపి ఈ నిధులను ఉపయోగించుకోవాలని కోరారు.

రెంజీ (RENGY)
భారతదేశ ఇంధన పరివర్తన (Energy Transition), వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు (Decentralized Energy Systems), మరియు క్షేత్రస్థాయిలో వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడం వంటి అంశాలపై అర్థవంతమైన చర్చకు 'Renergize 2026' ఒక వేదికగా నిలిచింది.

ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా Rengy సంస్థ తమ రాబోయే 'పీర్-టు-పీర్ (P2P) ఎనర్జీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్’ ను ప్రకటించింది. దీని ద్వారా గృహ వినియోగదారులు తమ వద్ద మిగిలిపోయిన అదనపు సోలార్ విద్యుత్తును ఒక నెట్‌వర్క్ ద్వారా ఇతరులకు అమ్ముకోవచ్చు. ఇది వినియోగదారులకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా, గ్రిడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు వికేంద్రీకృత ఇంధన వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

దీంతో పాటు, రూఫ్‌టాప్ సోలార్ వినియోగదారులకు విక్రయాల తర్వాతి సేవలు (after-sales service) మరియు లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి Rengy సంస్థ తమ కస్టమర్ యాప్ (Customer App) మరియు AMC (యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్) ప్లాట్‌ఫారమ్‌ ను ప్రారంభించింది. ఇది సోలార్ సిస్టమ్స్ యొక్క పనితీరును, నమ్మకాన్ని పెంచి, దీర్ఘకాలిక వినియోగానికి దోహదపడుతుంది.

భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి మరియు స్వయంసమృద్ధి గల ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సాంకేతికతతో కూడిన, పర్యావరణ అనుకూల పరిష్కారాల ఆవశ్యకతను ఈ సదస్సు పునరుద్ఘాటించింది.తదేశ క్లీన్ ఎనర్జీ, స్టార్టప్ & పాలసీ లీడర్‌షిప్ ఫోరం

భారతదేశ ఎనర్జీ భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు మరియు సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో AI ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ “రెంజీ (RENGY)” ఆధ్వర్యంలో “రెనర్జైజ్ 2026” జాతీయ స్థాయి కాంక్లేవ్ శనివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల లోక్ సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైహోమ్స్ గ్రూప్ ఛైర్మెన్ రామేశ్వర్ రావు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.రమేష్ రెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండి
అనిలా వావిళ్ల సహా పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో తొలి సారిగా ఏఐ ఆధారిత సేవలు అదిస్తున్న రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ సంస్థ “రెంజీ (RENGY)” కీ ఫీచర్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ‘రెంజీ’ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. సాంప్రదాయ వనరులపై దేశం అతిగా ఆధారపడకుండా, పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రధాని మోదీ 'క్లీన్ ఎనర్జీ విప్లవం' తీసుకొచ్చారు. ఇవాళ దేశంలో ‘రెన్యూవబుల్ ఎనర్జీ’ వినియోగం అనేది కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా, ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారింది. ఇంటిటింకి సోలార్ కరెంట్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ యోజన, రైతలు తమ పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పీఎం కుసమ్ యోజన, ఇందన ఉత్పత్పిలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిపేందుకు నేషనల్ సోలార్ మిషన్ స్కీంలను కేంద్రం తీసుకువచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతోపాటు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC), కోలిండియా (CIL) రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని గతేడాది అక్టోబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. అయితే దురదృష్టవశాత్తూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, భూమి కేటాయింపులు జరిపి ఈ నిధులను ఉపయోగించుకోవాలని కోరారు.

రెంజీ (RENGY)
భారతదేశ ఇంధన పరివర్తన (Energy Transition), వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు (Decentralized Energy Systems), మరియు క్షేత్రస్థాయిలో వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడం వంటి అంశాలపై అర్థవంతమైన చర్చకు 'Renergize 2026' ఒక వేదికగా నిలిచింది.

ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా Rengy సంస్థ తమ రాబోయే 'పీర్-టు-పీర్ (P2P) ఎనర్జీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్’ ను ప్రకటించింది. దీని ద్వారా గృహ వినియోగదారులు తమ వద్ద మిగిలిపోయిన అదనపు సోలార్ విద్యుత్తును ఒక నెట్‌వర్క్ ద్వారా ఇతరులకు అమ్ముకోవచ్చు. ఇది వినియోగదారులకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా, గ్రిడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు వికేంద్రీకృత ఇంధన వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

దీంతో పాటు, రూఫ్‌టాప్ సోలార్ వినియోగదారులకు విక్రయాల తర్వాతి సేవలు (after-sales service) మరియు లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి Rengy సంస్థ తమ కస్టమర్ యాప్ (Customer App) మరియు AMC (యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్) ప్లాట్‌ఫారమ్‌ ను ప్రారంభించింది. ఇది సోలార్ సిస్టమ్స్ యొక్క పనితీరును, నమ్మకాన్ని పెంచి, దీర్ఘకాలిక వినియోగానికి దోహదపడుతుంది.

భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి మరియు స్వయంసమృద్ధి గల ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సాంకేతికతతో కూడిన, పర్యావరణ అనుకూల పరిష్కారాల ఆవశ్యకతను ఈ సదస్సు పునరుద్ఘాటించింది.

Renergize 2026, India’s Clean Energy, Startup & Policy Leadership Forum
“రెనరెజైజ్ 2026” భారతదేశ క్లీన్ ఎనర్జై, స్టారాప్ & పాలసీ లీడర షిప్ ఫోరం

Renergize 2026, India’s Clean Energy, Startup & Policy Leadership Forum


“రెనర్జైజ్ 2026” భారతదేశ ఎనర్జీ భవిష్యత్తును
భీంసేరి చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్త్రీమింగ్ !!!

సుమన్, సునీల్, స్వప్న సంద ప్రధాన పాత్రల్లో దుర్గపల్లి ప్రభాకర్ నిర్మాతగా రవీంద్ర పూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీంసేరి.

ఒక క్రూరమైన పోలీస్ అధికారిణి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఒక నిరుపేద కుటుంబాన్ని దారుణమైన అన్యాయంతో నాశనం చేస్తుంది. ఆ దుర్ఘటన నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఒక బలమైన, దృఢ సంకల్పం గల మహిళ, ప్రతీకారం తీర్చుకోవాలనే తీవ్రమైన కోరికతో బూడిద నుండి తిరిగి పుంజుకుంటుంది. ఆమె ఆ అధికారిణి కోసం వేటాడుతుండగా, కొన్ని చీకటి నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇది అధికారం, అపరాధభావం మరియు న్యాయం మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోరాటానికి దారితీస్తుంది, ఇది భీంసేరి చిత్ర ఇతివృత్తం.

ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్త్రీమింగ్ అవుతోంది, చక్కటి కథ కథనలతో రూపొందిన ఈ సినిమాను కుటుంభ సభ్యులు మొత్తం కలిసి చూడవచ్చు.

భీంసేరి చిత్రం అమెజాన్ లో స్త్రీమింగ్ అవుతున్న సందర్బంగా చిత్రం యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది, ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Bheemseri movie now streeming on amazon prime
భీంసేరి చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్త్రీమింగ్ !!!

సుమన్,  సునీల్,  స్వప్న సంద ప్రధాన పాత్రల్లో దుర్గపల్లి ప్రభాకర్ నిర్మాతగా రవీంద్ర పూరి
TFDA

10 days ago

Young Achiever Abi Sri Satyam Gunti Receives Multiple World Record Honors at the Age of 8

A proud and historic recognition ceremony was held at the prestigious Abi Sri 1 Tower, Jubilee Hills, Hyderabad, where young achiever

Mr. Abi Sri Satyam Gunti

was officially honored for the remarkable world record titled

“Tallest Numerical ‘1’ Building Display”

The grand event witnessed the presence of distinguished dignitaries, media representatives, entrepreneurs, and guests from various organizations.

The official world record recognition was presented by

Adv. M. Sheik Mohamed MBA., LLB

Founder of Grand Universe Book of Records,
who appreciated the extraordinary vision and achievement behind the iconic architectural landmark.

The record features a magnificent 48-foot-high numerical “1” displayed across three sides of the building, creating a unique and globally recognized architectural display.

During the ceremony, official recognitions and certificates were also presented by

Karnataka Book of Records,

Bharatiya Book of Records, and

London Book of World Records.

The event was further honored by the gracious presence of

Mr. Mir Sameem Raza,

Founder of Karnataka Book of Records and Bharatiya Book of Records,
who personally presented certificates and appreciated the young achiever for his exceptional accomplishment.

At just 8 years of age,

Abi Sri Satyam Gunti

has now proudly achieved recognition from five world record organizations, creating a remarkable milestone at such a young age.

Adding to his growing list of achievements, he was also honored with the prestigious

Golden Startup Awards 2026

under the titles

“Youngest Entrepreneur”

and

“Inspirational Achiever of the Year 2026.”

Known for his entrepreneurial mindset, leadership qualities, social involvement, and inspirational vision, Abi Sri Satyam Gunti has emerged as a role model for young minds and future generations.

The ceremony was attended by his proud father

Mr. Sridhar Rao Gunti,

family members, and special guests who celebrated this proud moment of international recognition.

Speaking during the event, Founder

Adv. M. Sheik Mohamed MBA., LLB

stated that recognizing young talents and encouraging visionary achievements is one of the core missions of the Grand Universe Book of Records.

The event concluded with grand celebrations, award presentations, media interactions, and appreciation ceremonies, marking a memorable occasion of inspiration, excellence, and global recognition.
Young Achiever Abi Sri Satyam Gunti Receives Multiple World Record Honors at the Age of 8

A proud and historic recognition ceremony was held at the prestigious Abi Sri 1 Tower, Jubilee Hills, Hyderabad, where young achiever

Mr. Abi Sri Satyam Gunti

was officially honored for the remarkable world record titled

“Tallest Numerical ‘1’ Building Display”

The grand event
TFDA

14 days ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర మరియు టెలివిజన్ పరిశ్రమల అభివృద్ధి కమిషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ భరత్ భూషణ్ గారికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీ.ఎన్. ఆదిత్య,
ప్రధాన కార్యదర్శి పీ.వీ.రామారావు, కోశాధికారి నీలం సాయి రాజేష్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. వారి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా చలనచిత్ర పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర మరియు టెలివిజన్ పరిశ్రమల అభివృద్ధి కమిషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ భరత్ భూషణ్ గారికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం
TFDA

14 days ago

రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆకాశ్ జగన్నాథ్

రాయవలస మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి: హీరో కార్తీక్ జయంతి

కార్తిక్ జయంతి ని హీరోగా పరిచయం చేస్తూ RaysuN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “రాయవలస”. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. “Love Tied by Fate” అనే ట్యాగ్‌లైన్ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరయ్యారు.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీజర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మగారు డైరెక్టర్‌గా, వాళ్ల నాన్నగారు ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది. రాధిక గారికి హ్యాట్సాఫ్. తనంత బాధ్యత తీసుకుని వాళ్ల అబ్బాయిని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కార్తీక్ చాలా టాలెంటెడ్. యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని విషయాల్లో తనకు పూర్తి అవగాహన ఉంది. ఈ సినిమాలో ఎన్నో విషయాలు తన దగ్గరుండి చూసుకున్నాడు. హీరోగా తనకి ఇది పెద్ద స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీష స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తోంది. రవివర్మ గారు, అనిత గారు, అన్నపూర్ణమ్మ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ భుజాన వేసుకుని తీసుకెళ్తారు. ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ” అన్నారు.

కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంది. కార్తీక్‌ని వాళ్ల తల్లిదండ్రులే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయడం విశేషం. తల్లి డైరెక్ట్ చేయడం, ఫాదర్ ప్రొడ్యూస్ చేయడం, కొడుకు హీరోగా చేయడం ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ ముగ్గురూ ఒకే ఫ్యామిలీ కావడం వల్ల సినిమా ఇంకా ఈజీ అయింది. 11 ఏళ్లుగా వీళ్లు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు. ఇలాంటి క్వాలిటీని నేను గత పదిహేనేళ్లుగా ఏ ఎన్నారైలోనూ చూడలేదు. తప్పకుండా వాళ్లు పడిన కష్టానికి ఫలితం ఉంటుందని నమ్ముతున్నాను.

హీరో కార్తీక్ మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి, ఆకాష్ గారికి ధన్యవాదాలు. మీడియా అందరికీ థాంక్స్. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జరగడానికి కారణమైన మా అమ్మ, నాన్న, రాఖీ గారికి థాంక్యూ. సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఎక్సైట్మెంట్. నేను నా జీవితంలో ప్రేమించింది సినిమానే. నేను చేయాలనుకున్నది సినిమానే. దానికి తోడ్పడిన మా అమ్మకి థాంక్యూ. నా డ్రీమ్‌ని తన డ్రీమ్‌గా మార్చుకుని ఈ సినిమా చేశారు. నాకు మా నాన్న హీరో. పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడివరకు తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ థాంక్యూ. ‘రాయవలస’ రియల్ లైఫ్ ఆధారంగా తీసుకున్న స్టోరీ. దానికి అందరూ కనెక్ట్ అవుతారని, ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా ప్రమోషన్స్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. రాజు-రాణి కథని మీరు అందరూ చూసి కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకి హార్ట్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు” అన్నారు.

డైరెక్టర్ రాధిక జయంతి మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈరోజు మా నాన్నగారు మన మధ్యలో లేరు. ఆయన ఎక్కడున్నా బ్లెస్సింగ్స్ మనతోనే ఉంటాయి. మంచి చెప్పాలనే ఆలోచన ఉండేది కానీ, మా అబ్బాయి ద్వారా నాకు ఈ అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లిగా కొడుకుని లాంచ్ చేయడం చాలా పెద్ద విషయం. నేను, కార్తీక్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. కార్తీక్ చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా ఉండేవాడు. సంగీతం నేర్చుకున్నాడు. చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చాడు. తనకి యాక్టింగ్ అంటే కూడా చాలా ప్యాషన్ ఉంది. నేను చేసిన ‘మాయ’ ఫిలిం‌కి యూఎస్‌లో మంచి అప్లాజ్ వచ్చింది. సినిమా తీయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాం. రాఖీ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సందర్భంగా రాఖీకి థాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాతో ‘రాయవలస’ రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది. మా వారికి కథ నచ్చి ప్రొడ్యూస్ చేద్దామని చాలా ఎంకరేజ్ చేశారు. నా కలని, మా అబ్బాయి కలని నెరవేర్చడానికి మా వారు ఎంతగానో సపోర్ట్ చేశారు. మా టీమ్ మొత్తం అద్భుతమైన వర్క్ ఇచ్చారు. విజువల్స్, మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. అన్నీ కథకి తగ్గట్టుగానే ఉంటాయి. నటీనటులందరూ చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు. ఆకాష్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి థాంక్యూ. మా ఫస్ట్ లుక్‌ని బోయపాటి శ్రీను గారు లాంచ్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ శ్రీష మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థాంక్యూ. ఇది మంచి విలేజ్ డ్రామా. చాలా కొత్త కథతో వస్తోంది. నన్ను ఈ సినిమాలో రాణి పాత్రలో నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాధిక గారికి ధన్యవాదాలు. మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు. నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాయి. కార్తీక్ మల్టీ టాలెంటెడ్. తనకి సింగింగ్, డాన్స్ ఇలా అన్ని టాలెంట్స్ ఉన్నాయి. తను గొప్ప స్థాయికి చేరుకుంటాడని నమ్మకం ఉంది. అందరూ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

అనిత చౌదరి మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. కార్తీక్ చిన్నప్పటి నుంచి యూఎస్‌లో పెరిగాడు. రాధిక ఎప్పటినుంచో నాకు తెలుసు. తను జాబ్ చేస్తూ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు డైరెక్టర్‌గా వస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళా దర్శకులు తక్కువ. ఇప్పుడు రాధిక రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నేను కార్తీక్ మదర్‌గా కనిపిస్తాను. చాలా అద్భుతమైన పాత్ర. తప్పకుండా ఈ సినిమాని మీ అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

యాక్టర్ రవివర్మ మాట్లాడుతూ..“ఇది డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ అందరికీ ఫస్ట్ సినిమా. కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. రాధిక గారు యూఎస్‌లో ఉంటారు. అక్కడే ఉండి సినిమా తీయడం చాలా కష్టం. వాళ్లు ఒక మంచి సినిమా తీసుకొస్తున్నారు. కార్తీక్ చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. రాధిక గారు తన అబ్బాయిని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి లాంచ్ చేస్తున్నారు. చాలా ప్యాషన్‌తో చేసిన ప్రాజెక్ట్ ఇది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అన్నారు.

నిర్మాత గోపీకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఆకాష్ గారికి, కేఎల్ దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. RaysuN ప్రొడక్షన్స్‌ను మేము పదేళ్ల క్రితమే మొదలుపెట్టాము. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాము. ఫైనల్‌గా ఇప్పుడు థియేటర్ మూవీతో వస్తున్నాము. ఈ సినిమాని అందరూ ఆదరించాలని, మా చిన్న సినిమాని పెద్ద సినిమాగా చేయాలని కోరుకుంటున్నాను.

నటీనటులు: కార్తిక్ జయంతి, శ్రీష , అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాధిక జయంతి
కథ, సంభాషణలు: రాఖీ ఎ;
సంగీతం: అర్జున్ బాలా;
సినిమాటోగ్రఫీ: విఆర్‌కే నాయుడు (కిట్టు);
ఎడిటింగ్: గ్యారీ బిహెచ్
ఫైట్స్: మల్లేశ్ షాలియోన్
కొరియోగ్రఫీ: రాజ్ పైడే
పీఆర్వో: తేజస్వి సజ్జ
రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆకాశ్ జగన్నాథ్

రాయవలస మీ అందరికీ